Sri Devi Death : అసలు శ్రీదేవికి మ‌ద్యం ఎవరు అల‌వాటు చేశారు..? ఆమె మరణం వెనుక అసలు రహస్యం ఏమిటి..?

Sri Devi Death : అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి  భారతీయ సినీ అభిమానులకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆమె అందం అభినయంతో, దక్షిణాదినే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది శ్రీదేవి.   చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి తమిళ, తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించి తన నటనతో శ్రీదేవి అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు కృష్ణ వంటి అగ్ర హీరోలతోనే కాకుండా ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన నాగార్జున, వెంకటేష్ వంటి వారితో కూడా నటించి ఎన్నో ఘన విజయాలను తన సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కూడా అమితాబ్, మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర, అనిల్ కపూర్ వంటి హీరోలతో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఎన్నో విజయాలు అందుకుంది.

అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి వ్యక్తిగత జీవితం మాత్రం చివరికి విషాదంగా ముగిసింది. ఎంతో అందాలరాశి అయి ఉండి కూడా బోనీ కపూర్ కి రెండో భార్య అయ్యింది. చిన్నవయసులోనే ఎన్నో బరువు బాధ్యతలను తన భుజంపైన వేసుకొని ఏ కుటుంబం కోసం కష్టపడి పైకి వచ్చిందో ఆ కుటుంబం కోసం మోసపోయింది. ఇక శ్రీదేవి మరణ విషయంపై సీనియర్  జర్నలిస్ట్ ఇముంది రామారావు  ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Sri Devi Death what really happened on that day
Sri Devi Death

శ్రీదేవి ఫుల్ గా మద్యం సేవించి హోటల్ బాత్ టబ్ లో పడి గుండెపోటుతో మరణించింది అనే విషయాన్ని ఇముంది రామారావు ఖండించారు. ఇముంది రామారావు ఇదే విషయంపై మాట్లాడుతూ  శ్రీదేవికి చిన్న వయసు నుంచే మద్యం సేవించి అలవాటు ఉంది. షూటింగ్ టైంలో తనకు ఏదైనా బాధ కలిగితే ఇంటి వద్దకు వచ్చి ఏడిస్తే ఆమె తల్లి ఇతరుల నిద్రకు ఇబ్బంది కలగకూడదని ఆమెకి మద్యం అలవాటు చేసిందని రామారావు  వెల్లడించారు. చిన్నప్పటి నుంచి మద్యం అలవాటు ఉన్న శ్రీదేవి తను ఎంత ఎక్కువ మద్యం తీసుకున్న కూడా ఇతరులకు ఆ విషయం అసలు తెలియదు.

అలాంటి ఆవిడ కొంచెం మద్యం సేవించినంత మాత్రాన వాటర్ టబ్ లో పడి చనిపోయింది అంటే నమ్మశక్యంగా లేదు. కేవలం ఆమె పేరు మీద ఉన్న 200 కోట్ల ఇన్సూరెన్స్ రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. ఆమె ఇన్సూరెన్స్ కోసమే పక్కాగా ప్లాన్ చేసి మరి ఆవిడ మరణించేలా చేశారు అని, ఇలా ఎన్నో అనుమానాల మధ్య శ్రీదేవి మరణించింది అని ఇముంది రామారావు ఓ ఇంటర్వ్యూ ద్వారా  తన అభిప్రాయాన్ని వెల్లడిచేశారు.

Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

11 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

11 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago